Friday, May 3, 2024

తిరుమ‌ల‌లో.. రెండో భార్య‌తో ప్ర‌భుదేవా

తాజాగా ఇండియన్ మైకెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా తన రెండో భార్య హిమానీ సింగ్‌తో తిరుమలలో కనిపించారు. తన భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా నడుస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నయి. దీంతో పాటు హిమానీ సింగ్.. ప్రభుదేవా గురించి మాట్లాడిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటారని ఈ వీడియోలో ఆమె చెప్పింది. 2020లో కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుదేవా.. హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎప్పుడూ వీరిద్దరూ బయట కలిసి కనిపించలేదు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement