Wednesday, May 15, 2024

‘సర్కారు వారి పాట’ సినిమా కథ తెలిసిపోయింది !!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అయితే కరోనా కేసులు తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇక బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నతాధికారి పాత్రట. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల రూపాయలు ఎగవేసిన ఓ బిజినెస్ మాన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు. ఆయన చేసే ప్లాన్ ఏంటి అనే అంశం చుట్టూ సినిమా ఉంటుందట.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే మైత్రి మూవీస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తో మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement