Monday, April 29, 2024

సీఓఈ 2వ దశ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ వాయిదా..

బెల్లంపల్లి : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలలో ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరంలో అడ్మీషన్ల కోసం జరిగిన మొదటి స్ర్కీనింగ్‌ టెస్టులో ప్రతిభ చూపి 2వ స్క్రీనింగ్‌ టెస్టుకు అర్హత సాధించిన వారికి ఈ నెల 18న జరగాల్సిన 2వ దశ స్ర్కీనింగ్‌ టెస్టును వాయిదా వేసినట్లు బెల్లంపల్లి సీఓఈ ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు తెలిపారు. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న రిత్యా విద్యార్థులకు అసౌకర్యం కల్గించకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తిరిగి పరీక్షలు నిర్వహించే తేదిని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement