Monday, April 29, 2024

సిద్దార్థ్, శర్వానంద్ ‘మహా సముద్రం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రస్తుతం అజయ్ భూపతి సిద్దార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రలలో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

హే రంభన్ అంటూ సాగే ఈ పాట అప్పటి హీరోయిన్ రంభ కు ట్రిబ్యూట్ గా ఇచ్చారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్, భాస్కరభట్ల సాహిత్యం ఈ సాంగ్ హైలెట్ గా నిలుస్తున్నాయి. అలాగే సాంగ్ లో శర్వానంద్ పై దర్శకుడు అజయ్ భూపతి చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో మరి కొంతమంది సీనియర్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement