Friday, April 26, 2024

గ్రామీణ ప్రేమ‌క‌థా చిత్రం..

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా వైభవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తెలుసా… మనసా… వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ గ్రామంలో బెలూన్స్‌ అమ్ముకునే యువకుడు (పార్వతీశం), అదే ఊరిలో పని చేసే హెల్త్‌ అసిస్టెంట్‌ సుజాత (జశ్వి)ను ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటు-ంది కా నీ వారిద్దరూ ఆ ప్రేమను వ్య క్తం చేసుకోరు. మల్లి బాబు పలు సందర్భాల్లో తన ప్రేమ ను సుజాతతో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ చెప్ప లేకపోతాడు. అయితే ఉన్న ట్లు-డి మల్లి బాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూరం కావాల్సి వస్తుంది. మరి వారిద్దరూ కలుసు కున్నారా! అనేదే ‘ తెలుసా.. మనసా..’ సినిమా అని చిత్ర బృందం అంటోంది.

‘ తెలుసా… మనసా’ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగు తోంది. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత దిల్‌ రాజు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఫస్ట్‌ లుక్‌ను గమనిస్తే అందులో రోహిణి హట్టంగడి మంచంపై కూర్చుని ఉంటే ఆమె పక్కనే హీరోయిన్‌, ఓ చిన్న బాబు కూర్చుని ఉన్నారు. మంచం పక్కనే దానికి అనుకుని పార్వతీశం కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు.
నూతన దర్శకుడు వైభవ్‌ ఈ చిత్రాన్ని న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. గోపీ సుందర్‌ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రసాద్‌ ఈదర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement