Friday, April 19, 2024

గొంగ‌డి త్రిష‌కి ఘ‌న‌స్వాగ‌తం.. స‌న్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్ ఫైన‌ల్లో ఇంగ్లండ్ ను ఓడించి విశ్వ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ ఫైన‌ల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించింది.కాగా సీసీ మహిళల అండర్19 టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ఘన స్వాగతం లభించింది. టోర్నీ ముగిసిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన త్రిషకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టోర్నీలో త్రిషతో పాటు ఓ మ్యాచ్ లో భారత జట్టుకు ఆడిన హైదరాబాద్ క్రీడాకారిణి యశశ్రీ, జట్టుకు ఫిట్ నెస్ ట్రెయినర్ గా వ్యవహరించిన శాలినీలకు కూడా మంత్రి, క్రీడాశాఖ అధికారులు పుప్ఫగుచ్ఛాలు అందించారు. క్రికెటర్లు, వారి తల్లిదండ్రులను కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. త్రిషకు స్వాగతం పలికేందుకు అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో త‌ర‌లి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement