Sunday, May 5, 2024

బుల్లితెర యాంకర్ ఫేస్ బుక్ హ్యాక్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని వాడుతున్నారు. అయితే చాలా మంది సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్. కాగా తాజాగా బుల్లితెర యాంకర్ నటి గాయత్రి భార్గవి ఫేస్ బుక్ ఖాతా ను హ్యాక్ చేశారు కొంతమంది దుండగులు. దీంతో ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

ఇదే విషయంపై ఏ సి పి కె వి ఎం ప్రసాద్ స్పందిస్తూ గాయత్రి భార్గవి కి ఫేస్ బుక్ ఖాతాతో పాటు ప్రత్యేక పేజీ కూడా ఉందని దానిని గుర్తు తెలియని వ్యక్తులు ఆమె హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన కామెంట్స్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారని అన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement