Tuesday, May 21, 2024

అయోధ్య రాముడికి అపురూపమైన కానుక

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో 21 కిలోల వెండి ఊయలను ఏర్పాటు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్వీట్ చేసింది. ఈ వెండి ఊయలపై జూల ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొంది. సీతా సమేత శ్రీరాముడికి ఊయల సేవ చేయనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామమందిరం నిర్మాణ పనులు జరుగుతుండగా, ఆ పనులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. రామమందిరం పనులను దగ్గర్నుంచి చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ఆలయం పశ్చిమ భాగంలో ఓ గోడను కొంత మేర తొలగించి, అక్కడ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేయనున్నారు.

క్యూలైన్ల ద్వారా భక్తులు ఆ గ్రిల్ వంటి ఏర్పాట్ల ద్వారా పనులను పరిశీలించవచ్చు. రాముడి జన్మస్థలంలో ఆయన కోసం కడుతున్న ఆలయం ఇప్పుడెంత వరకు వచ్చిందో చూడాలని పెద్ద సంఖ్యలో భక్తులు కోరుతున్నారని ట్రస్టు పేర్కొంది. వారి అభ్యర్థనల మేరకు, నిర్మాణ పనులు చూసేందుకు వారిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. భక్తులు ఇప్పటివరకు ప్రధాన ఆలయ నిర్మాణానికి సమీపంలోని తాత్కాలిక ఆలయాన్ని మాత్రమే సందర్శించే వీలుంది. ఇప్పుడు తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయంతో భక్తుల కోరిక నెరవేరనుంది.

ఈ వార్త కూడా చదవండి: కేరళలో కొత్త రకం మ్యూటెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement