Saturday, May 4, 2024

ఓటీటీ పార్ట్న‌ర్ ని ఫిక్స్ చేసుకున్న షారుఖ్ ఖాన్ “డుంకీ”..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇటీవలే ‘పఠాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బాక్సీఫీస్ వ‌ద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక, అట్లీ దర్శకత్వంలో షారుఖ్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జవాన్’లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

కాగా, లేటెస్ట్ బాలీవుడ్ బ‌జ్ ప్రకారం, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న డంకీ సినిమా OTT పార్ట్న‌ర్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న జ‌రిగిన‌ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో, జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ని ఆవిష్కరించింది. అయితే ఫ్యూచ‌ర్ లో రానున్న సినిమాల లిస్ట్ లో డుంకీ కూడా ఉంది.

ఈ బాలీవుడ్ బిగ్గీలో తాప్సీ పన్ను కథానాయికగా క‌నిపించ‌నుంది. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement