Wednesday, May 1, 2024

ముంబైలో.. ఓజి ఫ‌స్ట్ షెడ్యూల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్ఆయ‌ణ్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒక‌టి.ఈ మూవీని సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో బిగ్‌ అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ 16 నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ముంబైలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మొదటి షెడ్యూల్‌లో పవన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌లపై సీన్ల్‌ చిత్రీకరిస్తారట. ఇప్పటికే చిత్రయూనిట్‌ ముంబైకి బయల్దేరినట్లు టాక్‌.

గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం‌. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్‌ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. దీనితో పాటుగా పవన్‌ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్‌ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్‌ సిత్తం రీమేక్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా పవన్‌, హరీష్‌ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను కూడా లైన్ లో పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement