Wednesday, May 1, 2024

సైంధ‌వ్.. సెకండ్ షెడ్యూల్ అప్ డేట్

రీసెంట్ గా రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సీనియ‌ర్ న‌టుడు వెంక‌టేశ్..సైంధ‌వ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇది వెంక‌టేశ్ కి 75వ మూవీ .ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. సైంధవ్‌ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వెంకటేశ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కాగా ఇటీవలే హైదరాబాద్‌లో సైంధవ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తయింది. అయితే కొంత విరామం తీసుకున్న వెంకీ టీం ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ను షురూ చేసింది.

తాజా అప్‌డేట్ ప్రకారం వెంకటేశ్‌ టీం ఇప్పుడు వైజాగ్‌ షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం అయ్యారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న సైంధవ్‌లో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సైంధవ్‌ చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో సైంధవ్‌ తెరకెక్కుతోంది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement