Monday, April 29, 2024

శ్రీవారి సన్నిధిలో సంపూర్ణేష్

టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన బజార్ రౌడీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో శ్రీవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 20న ఆయన నటించిన బజార్ రౌడీ సినిమా రిలీజ్ కాబోతోంది. బజార్ రౌడీ సినిమా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని అని అన్నారు.

ఇక ఈ సినిమాకు వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో మహేశ్వరి హీరోయిన్ గా నటిస్తున్నారు. కత్తి మహేష్, కరాటే కళ్యాణి, పృథ్విరాజ్, నాగినీడు మరి కొంతమంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై సంధి రెడ్డి శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement