Friday, April 26, 2024

ఫైనల్ మిషన్ స్టార్ట్ @మేజర్

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమాపై ఏదో ఒక అప్ డేట్ ని రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచుకొంటు వస్తున్నారు అడవిశేషు.

ఇక ఈ చిత్రం ఫైనల్ మిషన్, ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు అడవి శేషు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి ఈ సినిమాని అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. సోనీ పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement