Thursday, May 2, 2024

సోదరుడి మృతిపై ఆర్జీవీ ఎమోషనల్ !!

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు చనిపోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ సోదరుడు సోమశేఖర్ కరోనా తో మృతిచెందారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమశేఖర్ తుది శ్వాస విడిచారు. సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య ,కంపెనీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

అయితే సోమశేఖర్ మృతి పై ఆర్జీవీ ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. కొన్నేళ్లుగా తను మాతో లేడు. ఇతర బిజినెస్ లోకి వెళ్లడంతో చాలా కాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా లైఫ్ లో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతని చాలా మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెట్టారు ఆర్జీవీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement