Sunday, April 28, 2024

చెర్రీ, శంకర్, తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్..

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పాన్ ఇండియా లెవల్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం అందిరికి తెలిసిందే..అయితే ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం లోని తొలి సాంగ్ కోసం రికార్డింగ్ కోసం శంకర్ హైదరాబాద్ కి వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రికార్డింగ్‌ పనిని హైదరాబాద్‌లో ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. దీని కోసం శంకర్ ముందుగానే హైదారబాద్ లో మకాం వేశారు. ఈ భారీ సాంగ్‌ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ కూడా భాగమయ్యారు. పాట విని చాలా చరణ్ చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయినట్లు తెలుస్తోంది.

శంకర్ చిత్రానికి సంగీతం అందించడం తమన్ కి ఇదే తొలి సారి. శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురు చూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి’ (ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది” అని తమన్ గుర్తు చేసుకున్నారు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.

ఇది కూడా చదవండి : ప్రశాంత్ క్లైమాక్స్ ప్లాన్ మాములుగా లేదట!!

Advertisement

తాజా వార్తలు

Advertisement