Saturday, April 27, 2024

ప్రశాంత్ క్లైమాక్స్ ప్లాన్ మాములుగా లేదట!!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెకెక్కిన చిత్రం కేజిఎఫ్. బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రం వసూళ్ళ పరంగా కూడా మోత మోగించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అనుకున్న దాని కంటే క్లైమాక్స్ అదిరిపోతుందట. విజువల్ ట్రీట్ అనుకున్నదానికన్నా అద్భుతంగాఉండబోతుందట. ప్రతి ఒక్కరికి షాక్ కి గురి చేస్తోందట. మరి ప్రశాంత్ ఏం ప్లాన్ చేశాడో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement