Saturday, April 27, 2024

రాధే శ్యామ్ హక్కులు ‘జీ నెట్వర్క్’ కే సొంతం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తీస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా రాధేశ్యామ్. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మరో పది రోజుల రీషూట్ ను ప్లాన్ చేసింది. అందుకు సంబంధించి శుక్రవారం షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

అలాగే వీటితో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకోగా… తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా యొక్క అన్ని విభాగాల శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేర దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement