Sunday, April 28, 2024

పబ్జీకి మరో బాలుడు బలి

పబ్‌జి గేమ్ పిల్లల్లో వ్యసనంగా మారింది. ఎందరో పిల్లలు, యువత పబ్‌జి గేమ్‌కు బానిసలవుతున్నారు. కరోనా కారణంగా స్కూల్స్, కాలేజీలకు మూతపడడంతో పిల్లలు రోజంతా ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్జీ ఆడుతూ చాలా మంది చిన్నారులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్జి ఫైర్ గేమ్ ఆడుతూ 12 సంవత్సరాల మణికంఠ అనే బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్ లైన్ క్లాసుల కోసం బాలుడికి ఫోన్ ఇచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement