Monday, April 29, 2024

రాజుది రక్త చరిత్ర.. అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాశాడు: విజయసాయి

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు ఆస్తి హక్కు తమ పూసపాటి రాజ్యాంగంలో లేదని చెబితే చట్టం ఒప్పుకోదని విజయసాయి అన్నారు. ఏ బైలా అయినా.. ఫ్యామిలీ లా అయినా చట్టాలనికి లోబడి ఉండాలిన భారత రాజ్యాంగం నిర్దేశించిందని చెప్పారు. రెండింటికీ మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని తెలిపారు. పురాత దురాచారాలైన సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడం.. మా సంస్కృతిలోనూ, పూసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుతుందా అశోక్? అని నిలదీశారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలోనూ అశోక్ గజపతి పాత్ర ఉందంటూ విజయసాయి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. అశోక్ గజపతి కత్తి అందించి ఖతం చేశాడని తెలిపారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటిపేరు బాబుదైతే, రెండోది అశోక్‌దేనని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ శాసన సభ్యత్వాన్నీ రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్‌కు లేఖ రాసి ఆయనపై చెప్పులు కూడా విసిరాడని ఆరోపించారు. అశోక్ గజపతిది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్త చరిత్ర అని విజయసాయి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: కరోనా థర్డ్ వేవ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement