Friday, May 17, 2024

‘రాధే శ్యామ్’ – రీ షూట్ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో రాధే శ్యామ్, ఆదిపురుషుష్, సలార్ తో పాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే ఇందులో రాధే శ్యామ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా కొన్ని సీన్స్ మళ్లీ రీ షూట్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అయింది.

కానీ కరోనా మహమ్మారి దానికి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ రీ షూట్ లో మొదట ప్రభాస్ మాత్రమే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని అభిమానులు అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే కూడా పాల్గొనాల్సి ఉందట. అందుకు పూజ కూడా ఇప్పటికే ఓకే చెప్పిందట. కరోనా పరిస్థితులు మారగానే ఈ షూటింగ్ ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement