Monday, April 29, 2024

తెలంగాణ లో కరోనా బీభత్సం – ఒకే రోజు 43 మంది మృతి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణ లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 73,275 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 6,551 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం తెలంగాణ లో 4,01,783 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా గడిచిన 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మరణలతో మొత్తం మృతుల సంఖ్య 2042కి చేరింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3.34 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1418 న‌మోదు అయ్యాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి 554, రంగారెడ్డి 482, నిజామాబాద్ 389, సంగారెడ్డి 368, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 329 మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement