Sunday, May 5, 2024

ఆమె నో చెప్తే కాజల్ కు అవకాశం వచ్చిందట !!

జెఫ్రీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మోసగాళ్లు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు సోదరిగా చేప కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొదట కాజల్ ప్లేస్ లో ప్రీతిజింటాను అనుకున్నారట. కానీ అందుకు ప్రీతిజింటా అంగీకరించకపోవడంతో ఆ అవకాశం కాజల్ కు వచ్చిందట.

ఇక సినిమాను 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ఎక్కువ అయినప్పటికీ ఈ సినిమాపై నమ్మకం తోనే ఖర్చు పెట్టమని విష్ణు కూడా ఓ వైపు చెబుతున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కాం ఆదరంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర బడ్జెట్లో 4వ వంతు యుఎస్ టెక్నికల్ టీమ్ ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేశారట. మరి ఈ సినిమాతో విష్ణు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement