Wednesday, May 8, 2024

శ్రీరామ‌చంద్రుని దేవాల‌యానికి రూ.10ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన ప్ర‌భాస్

శ్రీరామ‌చంద్రుని దేవాల‌యానికి రూ.10ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు స్టార్ హీరో ప్ర‌భాస్. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ విరాళం మొత్తాన్ని భ‌ద్రాచ‌లం ఆల‌యానికి అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన 10లక్షల చెక్కును ప్రభాస్‌ తరఫున ఆయన బంధువులు దేవస్థానం ఈవో… ఎల్‌. రమాదేవికి అందజేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసింందే. ఓం రౌత్ డైరెక్షన్ లో.. తెర‌కెక్కుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో.. కాస్త పాజిటీవ్ వేవ్ ను సాధించగలిగారుసినిమా టీమ్. అయినా సరే ఇప్పటికీ కొన్నివివాదాలు ఈసినిమాను చుట్టు ముట్టి ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచా వ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆదిపురుష్ సినిమాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మొక్కుకున్నారో.. లేక రామడి పాత్ర చేస్తూ..ఇంత భారీ సినిమా చేస్తున్నందుకు.. మన భద్రాద్రి గుర్తుకువచ్చిందో తెలియదు కాని.. భద్రాచాల దేవస్థానానికి మాత్రం ఇలా 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు ప్రభాస్. సీతగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ నటించింది. రావణుడిగా ..సైఫ్అలీ ఖాన్ నటించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement