Thursday, May 16, 2024

Big Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో.. ఆరుగురు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement