Friday, April 26, 2024

మరోసారి కరోనా టెస్ట్ చేసుకున్న పాయల్ – ఆఫ్ సెంచరీ కొట్టేలా ఉంది

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది పాయల్ రాజ్ పుత్. అంతే కాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నటీనటులకు కరోనా టెస్ట్ లు తప్పనిసరి చేస్తూ ప్రతి ఒక్కరికి టెస్ట్ లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టిన పాయిల్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఇదే విషయాన్ని చెబుతూ ఇంస్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశారు. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ముందు మరోసారి పరీక్ష అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిటింగ్ అంటూ వీడియోలో పాయల్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే పాయల్ 32 సార్లు కరోనా టెస్ట్ చేయించుకుంది. ఇప్పుడు తాజాగా మరో నెంబర్ అకౌంట్ లో పడింది.

https://www.instagram.com/p/CNbodFLHiI_/?igshid=1nzco6se0pamy

Advertisement

తాజా వార్తలు

Advertisement