Friday, April 26, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరుగుతుండగా పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ త్రిపురారం మండలంలోని పలు తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు త్రిపురారం ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement