Thursday, April 25, 2024

ఆత్మ‌కూరులో ఓ తండ్రి ఘాతుకం..

సంగారెడ్డి – సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో శుక్రవారం ఓ ఘాతుకం చోటుచేసుకుంది.బార్య భర్త మధ్య వచ్చిన విబేధాలు..కుటుంబ కలహాలు ముగ్గరి ప్రాణం మీదికి వచ్చింది.ఈ సంఘటనలో పసిపిల్లల ప్రాణాలు బలికావలసి వచ్చింది . సంవత్సరాల పాప ప్రాణాలు కోల్పోగా…పెద్ద పాప,నిందితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …….. ఆత్మకూరు గ్రామంలో మంగలి శివకుమార్(28) గత 7 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు చెందిన లలిత తో వివాహం అయింది.వీరికి ఇద్దరు ఆడ పిల్లలు వీరు వివాహమైన కొత్తల్లో హైదరాబాద్ లోనే జీవించారు.అనంతరం గత 3 సంవత్సరాలుగా సొంత గ్రామం ఆత్మకూరు లో తల్లిదండ్రులకు దూరంగా నివాసం ఉంటున్నారు.ఈ మధ్య రెండు మూడు సార్లు తరుచూ ఆర్థిక పరిస్థితి వలన భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య పిల్లలతో పుట్టింటికి చేరింది. నిన్న గురువారం తన పిల్లలను తనకు ఇవ్వమని శివకుమార్ అత్తారింటికి వెళ్లి తన పిల్లలను భార్య దగ్గర నుండి తీసుకొని వచ్చాడు. అనంతరం ఆత్మకూరు శివారులో ఇద్దరు తన కూతుర్లు పురుగుల మందు ,మద్యం బాటిల్ తో ఆత్మకూరు గ్రామానికి చెందిన పలువురికి కనిపించగా వారిని ఆత్మకూరు లో ఇంటికి రాత్రి చేర్చారు . బాధితుడు అంతటితో వినకుండా రాత్రి థమ్స్ అప్ బాటిల్ లో పురుగుల మందు (మందు గులికలు) కలిపి తాను సేవించి పిల్లలకు త్రాగించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ తరలించే లోపు చిన్న పాప మృతి చెందింది .పెద్ద పాప , నిందితుడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement