Sunday, April 28, 2024

ఆస్కార్ అకాడ‌మీలో సభ్యులుగా విద్యా బాల‌న్‌, ఏక్తా కపూర్‌..

ఆస్కార్ అకాడ‌మీలోకి కొత్త స‌భ్యులుగా బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌ లు నియమించబడ్డారు. మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది. ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ, ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. పా, బూల్‌బుల‌య్యా, ప‌రిణీత‌, బాబీ జాసూస్‌, శ‌కుంత‌లా దేవి లాంటి చిత్రాల్లోనూ ఆమె న‌టించారు. 2011లో వ‌చ్చిన ద డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు. డ్రీమ్ గ‌ర్ల్‌, వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్‌, డ‌ర్టీ పిక్చ‌ర్ లాంటి సినిమాల‌కు వీళ్లు నిర్మాత‌లుగా చేశారు.

ఇది కూడా చదవండి: మాస్క్ మరిచిపోయిన రష్మిక…క్యూట్ స్మైల్ తో వీడియో వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement