Friday, May 10, 2024

వైఎస్ షర్మిలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న వేళ.. వైఎస్‌ షర్మిల‌కు కొత్త వ్యూహకర్త నియమితులయ్యారు. ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ ఇక నుంచి షర్మిలకు వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. ఆమె తమిళ‌నాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కూతురు ప్రియ. శుక్రవారం నాడు లోట‌స్‌పాండ్‌లో ష‌ర్మిల‌ను వ్యూహకర్త ప్రియ క‌లిశారు. సోష‌ల్ మీడియాతో పాటు, పార్టీ వ్యూహాల‌పై ష‌ర్మిల‌కు వ్యూహ‌క‌ర్తగా ప్రియ వ్యవ‌హ‌రించనున్నారు. త‌మిళ‌నాడులో ఓ మీడియాకు ప్రియ అధినేతగా ఉన్నారు.

మరోవైపు వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల తన పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు సమస్యలపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ షర్మిల పార్టీ బలోపేతంపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా షర్మిల అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె కొత్త వ్యూహకర్తను నియమించుకున్నారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ జెండా సిద్ధం.. నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం

Advertisement

తాజా వార్తలు

Advertisement