Wednesday, May 8, 2024

వేస‌వి బ‌రిలో కృష్ణ వ్రింద విహారి.. పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ..

నాగ శౌర్య ప్రధాన పాత్రలో దర్శకుడు అనిష్ ఆర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా కృష్ణ వ్రింద విహారి.. నాగ శౌర్య బ్రాహ్మణుడిగా నటిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా హిరోయిన్ గా నటిస్తోంది. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐరా క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 22 న విడుదల కావాల్సి ఉంది. అయితే, అది జరగలేదు..

ఈ చిత్రం వేసవి రేసు నుండి తప్పుకున్నట్లు కూడా పుకార్లు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడు మే 20 న ఈ సినిమా విడుదల కానుందని మూవీ మేకర్స్ అఫిషియ‌ల్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల్లో ఉందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్, ఛాయాగ్రహణం సాయి శ్రీరామ్ అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement