Saturday, May 4, 2024

రేవంత్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. నిరూపిస్తే నా కాలేజీని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తా: మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పీజీ మెడికల్‌ సీట్ల దందా అంశంపై మంత్రి పువ్వాడ అజయ్‌ స్పందించారు. శనివారం ఆయన ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. తనపై తప్పుడు ఆరోపణలను సహించేదిలేదని హెచ్చరించారు. ”పీజీ మెడికల్‌ సీట్ల దందా అంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నా మీద గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని తీవ్రంగా ఖంఢిస్తున్నా. ఖమ్మంలో గత 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్‌ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్న కౌన్సెలింగ్‌ అలాట్‌మెంట్‌ సమయంలోనే మా కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయి.

అలాంటప్పుడు మాకు బ్లాక్‌ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదు. రేవంత్‌ రెడ్డి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది పూర్తిగా నిరాధారం. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే స#హంచేదిలేదు. ఒక వేళ రేవంత్‌ రెడ్డి గనక నా కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్టు నిరూపిస్తే… నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తా… ఒకవేళ నిరూపంచలేని పక్షంలో రేవంత్‌ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్‌రెడ్డి సిద్దపడాలి. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీ ప్రతిష్టను మంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడుతాం” అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ్‌ అజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement