Sunday, April 28, 2024

ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్…కనీవినీ ఎరుగని లెన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కించబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అది మరేదో కాదు ఈ సినిమా కోసం ప్రపంచంలోని పలు భారీ చిత్రాలను తెరకెక్కించిన కెమెరా

లెన్స్ ఏరి అలెక్సా 65 తో షూట్ చేయబోతున్నారట. సుమారు లక్షా 50 వేల డాలర్ల కన్నా ఎక్కువ ఉండే ఈ కెమెరా అవెంజర్స్, పాసెంజర్, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ లాంటి ఎన్నో సినిమాలు తీశారట. మరి చూడాలి ప్రభాస్ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement