Monday, May 20, 2024

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న.. న్యూసెన్స్

విభిన్న‌మైన క‌థాంశంతో రూపొందిన చిత్రం న్యూసెన్స్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు నవదీప్ – బిందుమాధవి..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో, జర్నలిస్ట్ గా నవదీప్ .. టీవీ రిపోర్టర్ గా బిందుమాధవి నటించారు. శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా న్యూసెన్స్ నుండి హే మైనేరు పిల‌గాడా అనే లిరిక‌ల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు మేక‌ర్స్. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించగా, హరితేజ ఆలపించింది. హీరో .. హీరోయిన్ పై చిత్రీకరించిన పాట ఇది. కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ ను గురించి పబ్లిసిటీని ‘ఆహా’వారు ఒక రేంజ్ లో చేస్తున్నారు. దాంతో ఈ వెబ్ సిరీస్ కోసం అంతా కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. మే 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ‘ఆహా’వారు ఎనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.కాగా న‌టుడు నవదీప్ – బిందుమాధవి జంటగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ నిర్మితమైంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement