Friday, May 17, 2024

ఎర్రంనాయుడుకు వెంకయ్యనాయుడు నివాళులు

శ్రీకాకుళం, ఏప్రిల్ 19: మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటికి వెంకయ్యనాయుడు వచ్చి, అక్కడ ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బి.అశోక్, మాజీ విప్ కూన రవికుమార్, మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement