Friday, May 3, 2024

వైజాగ్ లో మంచు విష్ణు సందడి

మంచు విష్ణు హిట్ లేక ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు ఈ మంచు హీరో. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జెఫ్రే గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. మోసగాళ్లు మానియా అనే కాంటెస్ట్ నిర్వహించిన చిత్రయూనిట్ ఇందులో గెలిచిన వారికి విడుదల అవ్వక ముందే పదినిమిషాలు స్నీక్ పీక్ చూపిస్తామని విష్ణు గతంలో ప్రకటించారు.

ఈ కాంటెస్ట్ లో విన్నర్ కి ఈరోజు సాయంత్రం వైజాగ్ లో మెలోడీ థియేటర్ లో సాయంత్రం 5 గంటలకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కాగా పదినిమిషాల స్నీక్ పీక్ ని విన్నర్స్ తో కలిసి చూడటానికి వచ్చిన హీరో మంచు విష్ణు, నవదీప్ వైజాగ్ లో సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement