Friday, May 17, 2024

శివాలయంలో ప్రసాదం తిని 70 మంది ఆస్పత్రి పాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దుంగార్‌పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. శివరాత్రి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ప్రసాదం విషపూరితం కావడమే భక్తుల అస్వస్థతకు కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement