Tuesday, May 7, 2024

కామెడీనే నమ్ముకున్న మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక తర్వాతి షెడ్యూల్ హైదరాబాదులో ప్రారంభించింది. కానీ వెంటనే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ల మధ్య కామెడీ సీన్స్ అద్భుతంగా డిజైన్ చేశాడట పరశురాం. దూకుడు సినిమాలో మహేష్ ఎలాంటి కామెడీ టైమింగ్ పండించారో ఇప్పుడు కూడా అలానే పంచ్ డైలాగులతో అలరించనున్నాడట. ఇక దూకుడు సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మాత్రం యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement