Sunday, April 28, 2024

ఏపీలో తగ్గిన కరోనా కేసులు… కొత్తగా 12, 994 మందికి వైరస్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,994 కరోనా  నిర్ధారణ కాగా.. 96 మరణించారు. అదే సమంయలో 18,373 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 203762 యాక్టవ్ కేసులు ఉన్నాయి.  ఇప్పటి వరకు మొత్తం 1379837 మంది కోలుకున్నారు. మొత్తం 10222 మంది మహమ్మారి కారణంగా మరణించారు.

చిత్తూరులో 14, కర్నూల, విజయనగరం జిల్లాల్లో 10 మంది, అనంతపురంలో 9, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో 8, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో 4, ప్రకాశంలో 3, కడపలో ఇద్దరు బొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 2652 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు 1620, విశాఖపట్నం 1690, అనంతపురం 1047, గుంటూరు 670, కడప 847, కృష్ణ 274, కర్నూలు856, నెల్లూరు 503, ప్రకాశం 703, శ్రీకాకుళం 864, విజయనగరం 535, పశ్చిమగోదావరి జిల్లాలో 706 కేసులు నమోదు అయ్యాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement