Sunday, May 5, 2024

సుశాంత్ ను గుర్తు చేసుకున్న నవీన్ పొలిశెట్టి

నాకు తెలుసు సుశాంత్ నువ్వు ఇదంతా చూస్తున్నావని అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు నవీన్ పోలిశెట్టి. తాజాగా 2019వ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్చి త్రం చిచోరే కు ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు లభించింది. ఈ సినిమాలో హీరో నవీన్ పొలిశెట్టి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఈసినిమాలో ప్రధాన పాత్ర దారుడిగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు అవార్డు రావటం పట్ల నవీన్ ఈ ట్వీట్ చేశారు.

ఇక ఇటీవల నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ గా నవీన్ నటన అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా మంచి క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement