Tuesday, April 30, 2024

కరోనా దెబ్బ – తనకి తానే మేకప్ వేసుకుంటున్న జగపతిబాబు

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఈ మహమ్మారి ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతున్నాయి నేపథ్యంలో ప్రముఖ నటుడు జగపతి బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనా కి థ్యాంక్స్ చెబుతూ దాని మూలాన తనకి తానే మేకప్ వేసుకుంటున్న ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ డూపర్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో జగపతి బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement