Wednesday, April 24, 2024

దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి..

మహబూబాబాద్ : గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు నెలనెలా రూ. 3016 పింఛన్‌ ఇవ్వడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నారని అన్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు కూడా ఇక్కడే తయారు చేసి ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్డీఓ కొమురయ్య, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement