Friday, May 17, 2024

రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు రద్దు..

వేములవాడ : వేములవాడలోని ప్రముఖ శైవక్షేత్రమైన రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను ఈ నెల 22 వరకు రద్దు చేశారు.రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 21న జరగాల్సిన శ్రీరామనవమి రథోత్సవంతోపాటు కల్యాణాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విషయాన్ని గమనించి భక్తులు ఆలయానికి రాకుండా సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement