Friday, May 17, 2024

TS: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట..

బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌పై రెండు వారాల పాటు కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రగతి భవన్‌ వద్ద కారు ప్రమాదం కేసులో రహీల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రమాదం తర్వాత రహిల్‌ దుబాయ్‌కు పారిపోయాడు. అతడి కోసం గత కొన్ని రోజులు గాలించిన పోలీసులు చివరికి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రహీల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. ఏప్రిల్‌ 8న పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈనెల 22 వరకు రిమాండ్‌ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement