Monday, May 13, 2024

గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్.. హైదరాబాద్‌లో ప్రారంభమైన‌ కొత్త షెడ్యూల్

దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్. కాగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో న‌టిస్తొన్న ఈ మూవీకి కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రారంభమైంది.

వికారాబాద్‌, శంషాబాద్‌లలో కూడా మినీ షెడ్యూల్‌ జరగనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొననున్నారు. గేమ్ ఛేంజర్‌లో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర లాంటి ఇతర ప్రముఖ న‌టీన‌టులు కూడా ఉన్నారు. ఇక‌, దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఇతర కీలకమైన వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement