Wednesday, May 15, 2024

పర్హానా డిఫరెంట్ మూవీ…

పలు విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ మరో యూనిక్‌ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నిర్మించిన ‘ఫర్హానా’. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకుడు. 12న సినిమా విడుద లవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం నిర్వహించింది.
హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ ” ఫర్హానా నాకు చాలా ప్రత్యేక సినిమా. ఒక ఫిమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. ఫర్హానా చాలా డిఫరెంట్‌ మూవీ. ఇందులో చాలా బరువైన పాత్ర, ఇం-టె-న్స్‌ రోల్‌. షూటింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక సవాల్‌గా ఉండే ది. అన్నీ లైవ్‌ లోకేషన్స్‌లో షూట్‌ చేశాం.” అన్నా రు.

దర్శకుడు నెల్సన్‌ మాట్లాడుతూ ”ఇది నా మూడో సినిమా. దేశంలో మోస్ట్‌ ప్యాషనేట్‌ ఆడియ న్స్‌ తెలుగు రాష్ట్రాలలో వున్నారు. ఈ రోజు తెలుగు సినిమా వున్నత స్థానంలో వుంది. కం-టె-ంట్‌ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకు లు గొప్పగా ఆదరిస్తారు. ఫర్హానా అలాంటి మంచి కం-టె-ంట్‌ ఉన్న చిత్రం.” అని చెప్పారు.
నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు మాట్లాడుతూ ” గత ఏడాది ఒకే ఒక జీవితం విడుదల చేశాం, ప్రేక్షకులు దానికి అద్భుతమైన ఆదరణ ఇచ్చారు. ఇప్పుడు ఫర్హానాతో వస్తున్నాం. ” అన్నారు. జస్టిన్‌ ప్రభాకర్‌ మాట్లాడు తూ ” నేపథ్య సంగీతం చేస్తున్నప్పుడు చాలా ఎ-కై-్సటింగ్‌ అనిపించింది. ప్రేక్షకులుకి కూడా థియేటర్‌లో ఆ ఎక్సయిట్‌ మెంట్‌ వుంటు-ంది” అన్నారు.
ఐశ్వర్య దత్తా మాట్లాడుతూ ” ఐశ్వర్య రాజేష్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ ని , తనతో కలసి నటించడం ఆనందంగా వుంది. తన నుంచి చాలా నేర్చుకున్నాను.” అన్నారు.
జితన్‌ రమేష్‌ మాట్లాడుతూ.. నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రభు , దర్శకులు నెల్సన్‌కి థాంక్స్‌. సినిమా అవుట్‌పుట్‌ చాలా బావుంది. ఖచ్చితంగా సినిమా హిట్‌ అవుతుంది” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement