Monday, April 29, 2024

కర్ణాటక పోలింగ్ లో ఉద్రిక్తత.. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ధ్వంసం

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విజయపుర జిల్లా బస్వన్ బాగే వాడీ నియోజకవర్గంలోని మసబినల్ లో ఉద్రిక్తత జరిగింది. పోలింగ్ కేంద్రంపై గ్రామస్తులు దాడి చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను గ్రామస్తులు ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల దాడిలో ఎన్నికల సిబ్బంది కారును ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement