Monday, April 29, 2024

కరోనాతో అభిమాని మృతి – ట్వీట్ లు చేస్తున్న మెగా స్టార్స్

మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటారు. అందులో వీరాభిమానులు మరికొంతమంది ఉంటారు. అందులో ఒకరు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి కరోనా తో ఇటీవల మరణించారు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రసాద్ రెడ్డి కరోనాతో మృతి చెందడం పట్ల మెగాహీరోలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. నా బ్లడ్ బ్రదర్ ప్రసాద్ రెడ్డి, వెంకటరమణ కరోనా బారిన పడి మరణించారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుల, మత, వర్గ ,వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా వ్యవహరించేవాడు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తమ్ముడు ప్రసాద్ రెడ్డి మరణం కలిచివేసింది అంటూ అతని ఫోటోలను పోస్ట్ చేశాడు నాగబాబు.మరోవైపు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ లు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement