Thursday, May 2, 2024

థాయిలాండ్‌లో డబుల్‌ ఇస్మార్ట్‌

రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ల సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. గతంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌ ఈ చిత్రం. షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం ముంబైలో చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్‌ ్టసలిష్‌ మేకోవర్‌ అయ్యారు.

ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌ లో మొదలైంది. ఈ షెడ్యూల్లో హీరో రామ్‌, సంజయ్‌ దత్‌ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీ-వలే విడుదలైన సంజయ్‌ దత్‌ ఫస్ట్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. సంజయ్‌ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. రామ్‌, సంజయ్‌ దత్‌లను తెరపై కలిసి చూడటం ఆసక్తి కలిగిస్తుంది.

ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీ-నటు-లు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

డబుల్‌ ఇస్మార్ట్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలవుతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement