Tuesday, May 21, 2024

డిప్లొమా సీట్ల భర్తీకి 17న వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకై నాలుగు విడతల కౌన్సిలింగ్‌ పూర్తయింది. ఇంకా మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ ఎం. వెంకటరమణ తెలిపారు. పాలిసెట్‌-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సిలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

పదో తర గతి పాసైన వారికి ( పాలిసెట్‌ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ కౌన్సిలింగ్‌ హాజరు కావచ్చన్నారు. నిర్ణీత ఫీజు (రూ. 20,000/ యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ లకు, రూ.22,000 ప్రైవేటు పాలిటెక్నిక్‌లకు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ తీసుకొని కౌన్సిలింగ్‌ హాజరు కావాలని రిజిస్ట్రార్ర్‌ తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement