Tuesday, April 30, 2024

తమన్నా కోసం రంగం సినిమాను వదిలేసాడా ?

కేవీ ఆనంద్ దర్శకత్వంలో జీవా హీరోగా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కో. ఈ సినిమా తెలుగులో రంగం గా వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు వసూళ్ళను కూడా బాగానే రాబట్టింది. అయితే నిజానికి ఈ సినిమాలో మొదట హీరోగా శింబు ను అనుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మధ్య లోనే తప్పుకున్నాడు శింబు. దానికి కారణం లేకపోలేదట.

హీరోయిన్ కార్తీక తనకు సెట్ కాదని తమన్నా హీరోయిన్ గా అయితే ఈ సినిమా చేస్తానని చెప్పాడట శింబు. అయితే తమన్నాకు అయితే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించలేమని తమ వద్ద అంత బడ్జెట్ లేదని నిర్మాతలు చెప్పడంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement